ఆయన నెల క్రితమే అనుమతి కోరారు..డీజీపీ జేవీ రాముడు


విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ నెలరోజులు సెలవులు కోరడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.విజయవాడలో కాల్ మనీ దందా కోరలు విప్పిన నేపథ్యంలో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ సెలవులపై వెళ్తుండటంతో..కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఈ సందర్బంగా డీజీపీ రాముడు మాట్లాడుతూ కాల్ మనీ కేసులో తప్పుచేసిన వారిని వదిలి పెట్టమని..గౌతమ్ సవాంగ్ నెల రోజుల క్రితమే సెలవులు కావాలని అనుమతి కోరారని..ఆయన స్థానంలో సమర్ధవంతమైన అధికారిని నియమిస్తామని తెలిపారు.నగర ఇంఛార్జ్ సీపీగా సురేంద్ర బాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తా తెలిపారు.అంతేకాదు మేం చేస్తున్న విచారణ వడ్డీ వ్యాపారం పై కాదు అని..కాల్ మనీ పేరుతో మహిళలను వేధించేవారిని వదలిపెట్టమని అన్నారు.కాగా కల్తీ మందు కేసులో నిందితుడు మల్లాది విష్ణువు కోసం దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu