వైఎస్, బొత్సల గుట్టు బయటపడింది

 

Botsa Sharmila, Sharmila ysr congress, varla ramaiah tdp

 

 

దివంగత వైఎస్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వైఎస్ బతికున్న రోజుల్లో ఒకరి తప్పును మరొకరు కాపాడుకుంటూ వచ్చారని, ఇప్పుడు బొత్స విమర్శలతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విభేదాలు చోటుచేసుకోనంతవరకూ వైఎస్, బొత్స చేసిన అక్రమాలు, దోపిడీల్లో ఇరుకుటుంబాలూ భాగస్వాములయ్యాయని ఆరోపించారు.


వైఎస్ అల్లుడు అనిల్ చేసిన తప్పులు, దోపిడీల గురించి ఇప్పటికైనా వెల్లడించాలని బొత్సను.. తన తప్పులు, అక్రమాలను బొత్స ఎలా కప్పిపుచ్చారో చెప్పాలని అనిల్‌ను డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రాన్ని మరెంతగా దోపిడీ చేసేవారోనని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడు అనిల్‌కు కట్టబెట్టినప్పుడు బొత్సకు మాట ఎందుకు పెగల్లేదని నిలదీశారు.