మేయర్ బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్.. డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం మహముద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా అవకాశమిచ్చారని.. ఉద్యమంలో ఏ విధంగా పని చేశామో జిహెచ్ఎంసి అభివృద్ధి కోసం అలాగే కృషి చేస్తామని చెప్పారు.