క‌ృష్ణాజిల్లా పెడనలో పేలుడు...

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెడన రైల్వే స్టేషన్ దగ్గర వున్న చేపల మార్కెట్ దగ్గర పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. పేలుడు జరగడానికి కారణాలేంటన్న పూర్తి సమాచారం అందాల్సి వుంది. పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.