నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నారు.. ఎంపీ ఫైర్
posted on Sep 26, 2015 4:14PM

బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ పార్టీ విధానంపై మండిపడ్డారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆర్కే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్క పార్టీ వాళ్లు అనుసరించినట్టు డబ్బులు తీసుకొని టికెట్లు కేటాయిస్తున్నారని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మంచి పేరు ఉన్న వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల పక్క పార్టీ వాళ్లకి మనకి తేడా ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు సుశీల్ మోదీతో ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాత్రం అస్సలు స్పందించడంలేదని అన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు కూడా చాలా కోపంగా ఉన్నారని.. ఇలాంటివి జరగకుండా ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.