ఏపీ ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు కొత్త లెక్కలు..

 

ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం పరోక్షంగా అర్ధమైపోయింది. ఇప్పటికే కేంద్ర పెద్దల నుండి.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా రాదని.. ఇచ్చే అవకాశం లేదని తేటతెల్లమైపోయింది. గతంలో ఏపీకి అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై కొత్త లెక్కలు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని.. ఏమాత్రం అలక్ష్యం చేయదని చెపుతూ.. ప్రత్యేక హోదా ఇస్తే... కేంద్రం నుంచి కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే వస్తాయని.. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే... కేంద్రం నుంచి ఏపీకి ఏకంగా రూ.42 వేల కోట్ల మేర నిధులు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని ఆయన వాదించారు.