తెలంగాణ బీజేపీ సీనియర్ నేతకు కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ సైలెంట్ గా వ్యాపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆదివారం తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 199 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో 122 కేసులు కేవలం జిహెచ్ఎంసి పరిధిలో నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా జిహెచ్ఎంసి పరిధిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఒకరు ఈ వైరస్ బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటుగా అయన కుమారుడికి కూడా కరోనా టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయన తెలిపారు. త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా బయటకు వస్తానని ఆయన తన సన్నిహితులకు సందేశం పంపించారు.