స్వచ్ఛభారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ పై అధిష్టానం సీరియస్

 

 

భోపాల్ ఎంపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాను ఎంపీగా ఎన్నికయింది మరుగు దొడ్లు శుభ్రం చేసేందుకు కాదని ఆమె బీజేపీ కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్ల పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. సాక్షాత్తు ప్రధాని మోడీ తాను స్వయంగా పాల్గొంటూ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ పై ఆమె ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయటం పట్ల సామాన్యుల తో పాటు బీజేపీ నాయకులు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో అప్రమత్తమైన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సద్విని మందలించినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే ను దేశభక్తుడిగా  పేర్కొన్నపుడు, అలాగే అతనా శాపం కారణంగానే ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో అప్పట్లో బీజేపీ అధిష్టానం ఆమెను మందలించటం తో ఆమె క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే.