మైనర్ బాలికలపై అత్యాచారం..11 మంది అరెస్ట్

 

మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ బావిష్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, బుల్దాన జిల్లా హివర్‌ఖేడాలోని నినాదీ ఆశ్రమ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల ప్రెసిడెంట్, సెక్రెటరి, జాయింట్ సెక్రటరితో పాటు పలువురు సిబ్బంది ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారని.. వీరిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్‌)ను ఏర్పాటుచేశారు.