‘భారతరత్న’ రామోజీరావు!

మీడియా రంగంలో, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన దివంగత రామోజీరావుకు దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. రామోజీరావు ఇప్పటికే ‘పద్మవిభూషణ్’ అవార్డు పొందారు. ఆయన ‘భారతరత్న’ అవార్డుకు నూటికి నూరుశాతం అర్హుడని, ఆయనకు మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామోజీరావు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సన్నిహితుడే. నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు రామోజీరావును ప్రత్యేకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రామోజీరావుకు భారతరత్న ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని పలువురు దేశ ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu