ఓట్ల తొలగింపుపై ఆధారాలేవీ? భన్వర్ ప్రశ్న

హైదరాబాద్లో ఓట్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ స్పందించారు, ఓట్లు తొలగిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నా ఆధారాలు మాత్రం చూపడం లేదన్నారు, అయితే ఇప్పటివరకు 6.3 లక్షల ఓట్లు తొలగించామని, మరో 19 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని భన్వర్ లాల్ తెలిపారు, ఒకవేళ తొలగించిన ఓట్లలో అవకతవకలు ఉంటే... ఆధారాలతో సహా తెలియజేయాలని పార్టీలకు సూచించారు, ఎన్నికల సంఘం తొలగించిన ఓట్ల జాబితాను, అలాగే నోటీసులు ఇచ్చిన లిస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలకు అప్పగించిన భన్వర్ లాల్... అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు.