స్నానం చేస్తున్న యువతి ఫొటో తీసిన కానిస్టేబుల్

 

కాపాడాల్సిన వాడే కంత్రీగాడిలా మారిపోయాడు. గుంటూరు జిల్లా మాచర్లలో ఎస్కార్ట్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అశోక్ అనే యువకుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి విధి నిర్వహణలో భాగంగా వచ్చారు. ఆస్పత్రిలోని స్నానాల గదిలో స్నానం చేస్తున్న ఓ యువతిని తన సెల్‌ఫోన్‌లో వున్న కెమెరాతో వీడియో షూట్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ యువతి భయంతో కేకలు వేయడంతో అక్కడ వున్నవారు కానిస్టేబుల్‌ అశోక్‌ని పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కానిస్టేబుల్ అశోక్ మీద కేసు నమోదు చేశారు.