దళితుడు కాకుండా.. దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు: రేవంత్‌రెడ్డి

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన తెలంగాణకు ఓ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలోని వారిని టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర కేసీఆర్ కాపలాగా పెట్టాడని, టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి తీసుకురాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పిస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం చేతకాకపోతే, చంద్రబాబును ఒప్పించి మేమే విద్యుత్ తీసుకువస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ ఈ సందర్భంగా అన్నారు.