దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..స్తంభించిన సేవలు

వేతనాల పెంపుతో పాటు సుధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుపు సమ్మెకు దిగాయి. ఈ సమ్మెకు బ్యాంకు ఉద్యోగులకు చెందిన మెజారిటీ యూనియన్లు మద్ధతు తెలిపాయి. అటు యూఎఫ్‌బీయూ సమ్మెకు మద్దతు పలకగా, భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం సమ్మెలో పాల్గొనలేదు. సమ్మెను ముందే పసిగట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు సేవలకు అంతరాయం కలగవచ్చని కస్టమర్లకు ఎస్ఎంఎస్‌ల రూపంలో సమాచారం అందించాయి.