18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగి

 

కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాగశేఖర్ రెడ్డి అనే క్లర్క్ తన టాలెంట్ చూపించి బ్యాంక్ ఖాతాదారులకు చెందిన 18 లక్షల రూపాయలను నొక్కేశాడు. బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బును తన ఖాతాలోకి, తనకు తెలిసినవారి ఖాతాల్లోకి మళ్ళించి సొంతం చేసుకున్నాడు. నాలుగేళ్ళ క్రితం ఈ బ్రాంచ్‌కి వచ్చిన ఈయనగారు అప్పటి నుంచి మెల్లమెల్లగా ఇంత డబ్బు స్వాహా చేశాడు. మూడు నెలల క్రితం బ్యాంకుకు చెందిన డబ్బులో తేడా కనిపించిందని, ఆ తర్వాత బ్యాంకు అధికారులు జరిపిన పరిశోధనలో నాగశేఖర్ రెడ్డి నిర్వాకం బయటపడిందని తేలింది. బ్యాంకు అధికారులు ఇతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.