వచ్చే ఏడాదికి బందరు పోర్టు పూర్తి!

వచ్చే ఏడాదికల్లా బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.  రూ. 3,669 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పోర్టు పనులు జగన్ హయాంలో నత్తనడకన సాగాయని చంద్రబాబు విమర్శించారు.  నిన్న ఆయన పోర్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు.  పోర్టు నిర్మాణానికి అవసరమైన  మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు.   పోర్టు పూర్తైతే మచిలీపట్నం రూపురేకలే మారిపోతాయన్నారు.  అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News