దబిడి దిబిడే... నేను సైగ చేస్తే వాళ్ల పరిస్థితి మరోలా ఉండేదంటున్న బాలయ్య!

టీడీపీ నేతల మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. తనకు అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలను చేశారు. తన వెనక వందలాది మంది ఉన్నారని తాను సైగ చేసి ఉంటే వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏమయ్యేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరెడ్డి శాసనమండలిని పునరుద్ధరిస్తే జగన్ మండలిని రద్దు చేసి తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. మండలి చైర్మెన్ ను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవని ఆయన ఆవేదనను వెల్లడించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో తాము ముందుకెళ్తున్నామని. తమను అడ్డుకోవడం తగదని ఆయన మండిపడ్డారు. రోడ్ల పై పడి కొట్టుకోవడం లాంటి పనులు సంస్కృతికి తమ పద్ధతులకు విరుద్ధమని బాలకృష్ణ మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu