టీఆర్‌ఎస్‌ లోకి బాబూమోహన్!

 

టీడీపీ నేత, మాజీమంత్రి బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు! ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈనెల 26 తర్వాత ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో బాబూమోహన్ ఆంధోల్ నుంచి పోటీచేసి 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవలి కాలంలో ఆయనకు టీడీపీలోని కొంతమంది నేతలతో సంబంధాలు చెడిపోయాయని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. పార్టీలో కూడా తనకు పెద్దగా ప్రాధాన్యం కనిపించకపోవడం, తెలంగాణాలో టీఆర్ఎస్ అయితేనే ఈసారికి కాస్త ఉపయోగం ఉంటుందని భావించడంతో గులాబీ కండువా కప్పుకోడానికి బాబూమోహన్ సిద్ధపడుతున్నారు.