ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు ఫైర్

 

ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దమంటూ తెలంగాణా న్యాయవాదులు వేసిన పిటిషనుపై హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇంత కాలంగా సమ్మె జరుగుతున్నాసమ్మెను విరమిమ్పజేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అయితే సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘనేతలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, కానీ అవి ఫలించలేదని ప్రభుత్వ న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అయితే సమ్మె చేస్తున్నఉద్యోగులపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో చెప్పాలంటూ గట్టిగా అడిగింది. ప్రభుత్వం ఈ కేసులో వాయిదాలు కోరినట్లయితే వారానికి రూ.2లక్షలు జరిమానా వేస్తామని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వమే స్వయంగా సమ్మెను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టులో ఈ కేసుపై ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నాయి.