మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
posted on Apr 18, 2025 3:15PM
.webp)
ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో నూతంగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగినులు ప్రసూతి సెలవులు తీసుకున్నా ప్రొబేషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఈ మేరకు ప్రసూతి సెలవులను డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇదివరకు రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే మాతృత్వ సెలవులు ఉండేవి. తాజాగా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి. నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాస్టర్ల, క్రైస్తవ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.