మహేష్కి తాకిన రాజధాని ఉద్యమ సెగ.. నెక్స్ట్ బన్నీ, తారక్!!
posted on Jan 10, 2020 11:52AM
ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలలు, యువత చేస్తోన్న ఉద్యమం హైదరాబాద్ కి పాకింది. ఈ ఉద్యమ సెగ టాలీవుడ్ స్టార్ హీరోల ఇంటి గడపలకు తాకుతోంది. హైదరాబాద్ లోని ఫిలింనగర్లో ఉన్న మహేష్ బాబు ఇంటి ముందు.. ఏపీ రాజధాని కోసం 'జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి' నాయకులు శుక్రవారం నాడు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. మరి ఈ వ్యవహారంపై మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు..19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ & అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల ఇళ్ల ముందు వీరు ఆందోళన వ్యక్తం చేసే అవకాశముంది.