ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల...

 

ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో బాలికలు 94.77 శాతం, బాలురు 94.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే మూడు శాతం ఉత్తీర్ణత పెరిగిందని.. కడపజిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, చిత్తూరుజిల్లా చివరిస్థానంలో ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు జూన్ 16 నుండి అడ్వాన్స్ డ్ సంప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలియజేశారు.