బీజేపీ మంత్రిగారు ఏం చెప్పారు..


ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అటు పార్లమెంట్ లోనూ.. ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులందరూ రాజకీయాలకతీతంగా ఒక్కటై పార్లమెంట్లో తమ వాదనలు వినిపించారు. ఇక రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేపట్టిన బంద్ కు పార్టీలన్నీ మద్దతు తెలిపి బంద్ లో పాల్గొన్నాయి. ఇలా అందరూ ఏపీకి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తుంటే.. బీజేపీ నేత మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదని.. ప్రత్యేకహోదా అనేది వరకట్నం లాంటిదని, దానిని 14వ ఆర్థిక సంఘం కట్ చేసిందని అందువల్లే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఏపీని స్పెషల్ స్టేటస్ గా కాకుండా స్పెషల్ స్టేట్ గా మోదీ సర్కార్ గుర్తించిందని, అందుకే అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఏపీకి హోదా, రాజధాని నిర్మాణం విషయంలో దేశంలో ఇప్పటివరకు విభజించిన ఏ రాష్ర్టానికి కేంద్రం ఇవ్వలేదని, స్వయంగా ఎదిగాయని గుర్తు చేశారు. మొత్తానికి బేజీపీ నేతలు మొదటి నుండి చెబుతున్న మాటలను.. మంత్రిగారు మరోసారి రిపీట్ చేశారు. ఇప్పటికే ఏపీ ప్రజలకు బీజేపీపై నమ్మకం పోయింది. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలతో అది ఇంకాస్త బలపడినట్టైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu