ఏపీ అసెంబ్లీ సమావేశాలు కుదింపు

 

ఏపీ అసెంబ్లీ వర్షాకాల పనిదినాలు 8 రోజులకు ప్రభుత్వం కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. శాసన సభ  వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో తొలుత నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత 8 రోజులకు కుదించారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరగనుంది. 

సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం రూ. 1.30 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu