ఏపీ మంత్రివర్గం సమావేశం... కేంద్రానికి తెరాస ప్రభుత్వంపై ఫిర్యాదు

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి కోరనున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. ఈ విషయంలో గవర్నర్ కూడా ఏం పట్టించుకోవడం లేదని మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో పోలీసు వ్యవస్థ రెండు రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేలా చేయాలని... పోలీసు వ్యవస్థ కూడా గవర్నర్ ఆధీనంలో ఉండాలని ఏపీ మంత్రివర్గం కేంద్రాన్ని కోరనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu