నేడు హైదరాబాద్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలలు తరువాత మళ్ళీ నేడు హైదరాబాద్ లో కాలుపెట్టబోతున్నారు. ఇక నుండి వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటానని ఆయనే స్వయంగా ప్రకటించారు. జనవరిలో జరుగబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేయడానికే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లి రావాలనుకొంటున్నట్లు సమాచారం. ఇవ్వాళ్ళ ఆయన సచివాలయానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇవ్వాళ సాయంత్రం లేదా రేపు ఉదయం జంటనగరాలలో పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. డిశంబర్ నెలలో పార్టీ నేతలతో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను ఎదుర్కోవడానికి వారికి దిశా నిర్దేశం చేస్తారని కుతుబుల్లా పూర్ తెదేపా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu