రెచ్చిపోయిన మావోలు... రైల్వేస్టేషన్ పేల్చివేత..


మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏవోబీలోని (ఆంధ్రా ఒడిశా సరిహద్దు) రైల్వే స్టేషన్ ను పేల్చి భీభత్సం సృష్టించారు. వివరాల ప్రకారం...ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని డోయకల్‌ రైల్వే స్టేషను వద్ద ఆగివున్న గూడ్స్ రైలింజన్‌ ను బాంబులతో పేల్చేశారు. ఆపై స్టేషన్ ను నాశనం చేశారు. సుమారు 15 నుంచి 20 మంది నక్సల్స్ ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. మరోవైపు ఈ ఘటన కారణంగా పలు రైళ్లను దారిమళ్లించగా, కొన్నింటిని నిలిపివేశారు.