చంద్రబాబు లోకేష్ ల పై ఎపి మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

 

 

ఎపి మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ లోను, అలాగే బయట కూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శలతో ఇరుకున పెడుతున్నారు. దీనితో పాటు ట్విట్టర్ లో అపుడపుడు ట్విట్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి టీడీపీ యువ నేత లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల పై నిలదీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.  ఐతే చంద్రబాబు తాజాగా చేసిన ఒక ట్వీట్ విషయంలో మాత్రం అయనను ఇబ్బందికి గురి చేసింది. ఇప్పుడు దీనిపై నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్ ల పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో వాళ్ళిద్దరికీ మతి స్థిమితం సరిగా లేదని, అందుకే ట్విట్టర్ లో అడ్డుగోలుగా విమర్శలు చేస్తున్నారని, అప్పుడెప్పుడో 2015 లో తెలంగాణలో జరిగిన ఆందోళన ఫోటో తీసుకోని ఇప్పుడు ఏపీలో జరిగినట్లు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ఐతే అది తప్పుడు ఫోటో అని తెలిసేసరికి డిలీట్ చేసారని అన్నారు. తండ్రి కొడుకులు అధికారం కోల్పోయేసరికి ఏమి మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ రెచ్చిపోయారు మంత్రి అనిల్ కుమార్.