రేపు ఏపీ, టీఎస్ సీఎంల కీలక మీటింగ్

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలనూ గవర్నర్ నరసింహన్ పక్కన కూర్చోబెట్టుకున్న గవర్నర్ ఇద్దరు సీఎంలూ పరస్పరం సహకరించుకోవాలని కోరిన విషయమూ తెలిసిందే. గవర్నర్ విజ్ఞప్తికి ఇద్దరు ముఖ్యమంత్రులూ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం నాడు భేటీ అవుతున్నారని సమాచారం. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, చీఫ్ సెక్రటరీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల గురించి చర్చిస్తారు. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.