ఏపీ శాసనసభ రేపటికి వాయిదా

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం నాడు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. వైసీపీ సభ్యులు సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో వరుసగా మూడోసారి 15 నిమిషాల చొప్పున సభ వాయిదా పడింది. నాలుగోసారి సమావేశం ప్రారంభమైనప్పటికీ వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో శాసనసభను స్పీకర్ కోడెల శివప్రసాద్ బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు స్పీకర్‌ మైక్‌ విరగొట్టే ప్రయత్నం చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. దీంతో వైసీపీ సభ్యుల తమ నినాదాలను కొనసాగించారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలపడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu