రఘువీరా పై ఆనం రామనారాయణరెడ్డి ఫైర్.. అది మట్టి యాత్ర

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది తాజా పరిణామాలు చూస్తుంటే. అందుకే ఇప్పుడు డైరెక్ట్ గానే ఏపీ పీసీసీ రఘువీరా రెడ్డిపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఆనం బ్రదర్స్ రఘువీరా రెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమకు చెప్పకుండా రఘువీరా నెల్లూరు కమిటీ ఏర్పాటు చేసినందుకు గాను.. మాకు చెప్పకుండా కమిటీ ఎలా ఎంపిక చేస్తారు అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రఘువీరా మట్టి సత్యాగ్రహం చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. రఘువీరా చేస్తున్న యాత్ర కేవలం మట్టి యాత్రగా ఆయన కొట్టి పడేశారు. ప్రజల్లో ఆదరణ లేకుండా రఘువీరా ఎన్ని యాత్రలు చేసినా వేస్ట్ అని ఆయన తేలిగ్గా తీసిపడేశారు. దీంతో ఇప్పుడు ఆనం బ్రదర్స్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ జిల్లాకే చెందిన బీజేపీ నేత వెంకయ్యనాయుడితో  ఈ బ్రదర్స్ టచ్ లో ఉంటున్నారట.. దీంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu