అమిత్‌షాకు కరోనా పాజిటివ్

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసినవాళ్లందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.