తెలుగులో మాట్లాడిన సింగపూర్ మంత్రి

 

ఏపీ నూతన రాజధాని అమరావతికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుభాకాంక్షలు తెలియజేశారు, అక్కడక్కడా తెలుగులో మాట్లాడుతూ దసరా శుభాకాంక్షలు చెప్పిన ఈశ్వరన్... ఆంధ్రులను ఆకట్టుకున్నారు, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందని, ఏడాది క్రితమే చంద్రబాబు తన విజన్ గురించి వివరించారని, అందుకే అమరావతి మాస్టర్ ప్లాన్ చేసిచ్చామని అన్నారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ పెద్దలు, ప్రజల మద్దతుతో సింగపూర్‌ సంస్థలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాయని, దీన్ని జులైలోనే ఏపీకి అందజేశామని ఈశ్వరన్ తెలిపారు, సింగపూర్‌ ప్రధాని, ప్రజల తరపున ఏపీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈశ్వరన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu