గవర్నర్తో అఖిలేష్ భేటీ..రాజీనామా ఇవ్వడానికేనా..?
posted on Oct 26, 2016 2:48PM
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజుకోక మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్పై సీఎం అఖిలేష్ వేటు వేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో అమర్సింగ్, అఖిలేష్ యాదవ్ వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరిపైనయినా..ఏ క్షణంలోనైనా వేటు పడే అవకాశం ఉందని ఎస్పీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ అఖిలేశ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర గవర్నర్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుండటంతో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని..అందుకోసమే గవర్నర్తో సమావేశమయ్యారని రాజకీయవర్గాల్లో వూహాగానాలు వినిపిస్తున్నాయి