అగస్టా స్కాంలో ట్విస్ట్... అప్రూవర్‌గా మారడానికి సిద్ధమైన మధ్యవర్తి

 

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం నేపథ్యంలో రాజ్యసభ అధికార, ప్రతిపక్ష నేతల ఆందోళనతో అట్టుడుకుతోంది. మరోవైపు ఈ కేసులో ఎస్పీ త్యాగిని కూడా ఈడీ మూడు రోజుల నుండి విచారిస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్కాంలో మరో ట్విస్ట్ భయటపడింది. ఈ కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్ అప్రూవర్ గా మారడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని క్రిస్టియన్ తరపు లాయర్ రోస్ మేరీనే స్వయంగా వెల్లిడించినట్టు సమాచారం. క్రిస్టియన్ త్వరలో ఇండియాకు వెళ్లాలని భావిస్తున్నారని.. ఆయన అప్రూవర్ గా మారడానికి సిద్దంగా ఉన్నారని.. అయితే వాస్తవాలు వెల్లడించడానికే తప్ప అరెస్ట్ వారెంట్ పై కాదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఇండియన్‌ ఎంబసీకి అందచేస్తారని చెప్పారు. దీని ప్రకారం క్రిస్టియన్‌కు తెలిసిన సమాచారం అంతా భారత దర్యాప్తు సంస్థలతో పంచుకుంటారని చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు ఎదురవుతాయో చూడాలి.