అగస్టా స్కాం.. వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు

అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుకి సంబంధించిన విషయాలు ఈరోజు సభలో ప్రవేశపెడతానని పారికర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ స్కాంప్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులతో అత్యవసరం భేటీ అయ్యారు. అంతేకాదు ప్రతిపక్షం కూడా వ్యూహప్రతివ్యూహాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సైతం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అగస్టాపై సభలో అనుసరించాల్సిన వ్యూహం, అధికార పక్షం ఎత్తుగడలను ఏవిధంగా తిప్పికొట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu