అమెరికా బేస్‌పై తాలిబ‌న్ల దాడి.. న‌లుగురు మృతి

 

గత రెండు రోజుల క్రితం ఆప్ఝనిస్థాన్ లోని జర్మన్ కాన్స్ లేట్ పై ఆత్మహుతి దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దాడి జరిగింది. వివరాల ప్రకారం.. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అమెరికా సైనిక స్థావ‌రంపై తాలిబ‌న్ల‌ను దాడి చేశారు. కాబూల్‌కు స‌మీపంలో ఉన్న బాగ్రామ్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్ర‌వాదులు సూసైడ్ బాంబ‌ర్ల దాడి జరిపారు. ఈ దాడిలో న‌లుగురు మృతిచెందగా.. మ‌రో 14 మంది గాయ‌ప‌డ్డారు. సూసైడ్ బాంబ‌ర్లు ఆ దాడి చేసిన‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. బాగ్రామ్ విమానాశ్ర‌యంలో వెట‌ర‌న్స్ డే జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఆత్మాహుతి దాడికి ప్ర‌య‌త్నించారు.