భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు...

 

ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో భారీ పేలుడు సంభవించిదం. కాబుల్ లోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద ఈ భారీ పేలుడు చోటుచేసుకుంది. అయితే ఈ పేలుడు వలన ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ.. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి రాయబార కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన భద్రతా సిబ్బంది ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వెంటనే రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. జర్మన్‌ గేటు వద్ద పేలుడు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు

 

.