కేబుల్ ఆపరేటర్ల వెరైటీ వాదన

 

దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ‘‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్రగానీ ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చాయి. మాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు టీవీ ఛానళ్ళ యాజమాన్యాలకు ఎంతమాత్రం లేదు’’ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu