లొంగిపోయిన 400 మంది ఉగ్రవాదులు..

 

పాకిస్థాన్ లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 400 మంది ఉగ్రవాదలు లొంగిపోయారు. అయ్యారు. వివరాల ప్రకారం..బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నగరంలో సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలసిపోయారు. ఇందుకుగాను బలూచిస్థాన్ అసెంబ్లీలో ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. బలూచ్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీ, సీనియర్ ఆర్మీ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెహ్రీ మాట్లాడుతూ, ఉగ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.