అవి బూటకపు ఎన్‌కౌంటర్లే: సీబీఐ కోర్టు

 

 

 

పోలీసులు ఎప్పడైనా ఎన్‌కౌంటర్‌ చేశారంటే, అది తప్పకుండా బూటకపు ఎన్‌కౌంటరే అని నోట్లో వేలేసుకునే అమాయకులు కూడా చెబుతూ వుంటారు. పోలీసుల ఎన్ కౌంటర్లు జనం దృష్టిలో అంత చీపైపోయాయి. ఈ విషయాన్నే ఢిల్లీ సీబీఐ కోర్టు కూడా అంటోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు 17 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. 18 మంది భద్రతా సిబ్బందిపై ఆరోపణలు రాగా ఒకరు మాత్రం కేసు నుంచి బయటపడ్డారు. నిందితులకు సీబీఐ కోర్టు శనివారం శిక్షలను ఖరారు చేసే అవకాశముంది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 2009లో ఉత్తరాఖండ్లోని డూన్లో రణ్బీర్ అనే ఎంబీఏ విద్యార్థిని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చిచంపారు. అమాయకుడైన రణ్బీర్‌ని అన్యాయంగాచంపడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్పై బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం 17 మందిపై హత్య, కిడ్నాప్, కుట్ర అభియోగాలు రుజువయ్యాయి. ఈ సందర్భంగా రణ్బీర్ తండ్రి మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వల్ల తన కొడుకు తిరిగిరాడని, ఆ నష్టం పూడ్చలేనిదని అన్నారు.అయితే నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల ఇలాంటి నేరాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు.