సమైక్య శంఖారావానికి రావద్దు
posted on Oct 25, 2013 4:17PM
.jpg)
వర్షాల మూలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయక చర్యలలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో జరుగుతున్న సమైక్య శంఖారావం సభకు రావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. తుఫాను మూలంగా ఇబ్బందులు ఉన్నా..తుపాను కంటే విభజన సమస్య చాలా తీవ్రమయినదని అందుకే సమైక్య శంఖారావం సభ యధావిదిగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. సభను వాయిదా వేయాలా ? నిర్వహించాలా ? అన్న విషయంలో పార్టీలో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఢిల్లీకి సమైక్య వాణి వినిపించేలా సభ నిర్వహించాలని, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సభ కొనసాగించాలనే వైఎస్ జగన్ పట్టుబడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.