పార్టీ ఫిరాయించే నేతలపై పయ్యావుల కామెంట్లు.. ప్రొద్దుతిరుగుడు పువ్వులాంటివారు


పార్టీ ఫిరాయించే నేతలపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన మినీ మహానాడు సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతుంటారు.. వారు ప్రొద్దు తిరుగుడు పవ్వులాంటివారు.. సూర్యుడు ఎటు తిరిగితే పువ్వు అటు తిరిగినట్టు.. వారు కూడా అధికారం ఎటు ఉంటే అటు వెళుతుంటారు.. అలాంటి వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి కూడా ఇబ్బందులు రావొచ్చని ఆయన అన్నారు. అయితే ఇదే సభలో ఇటీవలే వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా కూడా పాల్గొన్నారు. దీంతో పయ్యావుల చేసిన వ్యాఖ్యలకు ఆయన సమావేశం ముగియక ముందే అక్కడి నుండి వెళ్లిపోయారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu