లండన్ ఉగ్రదాడి మాపనే..
posted on Jun 5, 2017 11:06AM

బ్రిటన్ రాజధాని లండన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. లండన్ బ్రిడ్జిపై ముగ్గురు ఉగ్రవాదులు వ్యాన్తో బీభత్సం సృష్టించగా.. బోరోహ్ మార్కెట్లో మరికొందరు ఉగ్రవాదులు కత్తులతో ప్రజలపై దాడికి దిగారు. కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ రెండు ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
అయితే ఇప్పుడు లండన్ బ్రిడ్జిపై జరిగిన ఉగ్రదాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించింది. ‘‘ఇస్లామిక్ స్టేట్ పోరాట యోధులు లండన్లో దాడికి పాల్పడ్డారు’’.. అని అమాఖ్ మీడియా పేజీలో ఐసిస్ పేర్కొంది.