స్పీకర్‌గా కోడెల ఏకగ్రీవ ఎన్నిక

 

 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ గడువు ముగిసేసరికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ప్రకటన లాంఛనమే. అంతకు ముందు స్పీకర్ పదవి కోసం కోడెల, కాల్వ శ్రీనివాసులు పేర్లను చంద్రబాబు పరిశీలించినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిని స్పీకర్‌గా చేయాలని యోచనలో ఉన్న చంద్రబాబు మొదట కాల్వ శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. అయితే కాల్వ స్పీకర్ పదవిపై ఆసక్తి చూపలేదని, కొంత ఆలస్యమైనా కేబినెట్‌లో అవకాశం కల్పించాలని చంద్రబాబునాయుడిని కోరడంతో స్పీకర్ పదవికి కోడెల పేరును ఖరారు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, ఈసారి సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన కోడెల ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లోను, చంద్రబాబు క్యాబినెట్ లోను మంత్రిగా పనిచేశారు.