నగరంలో నలుగురు బాలికలు అదృశ్యం...

 

హైదరాబాద్ నగరంలో బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్, చందానగర్ కు చెందిన నలుగురు బాలికలు స్వప్న (12), పద్మ (10), రేణుక (9), కావేరి (8) ఐదు రోజులుగా కనిపించకుండా అదృశ్యమయ్యారు. దీంతో బాలికల తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను ఎవరన్నా కిడ్నాప్ చేశారా.. లేక వారే ఎటైనా వెళ్లారా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో స్వప్న అనే బాలిక ఇలాగే వెళ్లిపోయిందని.. మళ్లీ తిరిగొచ్చిందని.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అలాగే మిగిలిన బాలికలను కూడా తీసుకెళ్లిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియాలంటే వారు దొరికాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu