తెలంగాణపై సీమాంద్ర నేతల కుట్రలు
posted on Jul 11, 2013 6:52PM
తెలంగాణ ఏర్పాటుపై కదలిక మొదలు కాగానే సీమాంద్ర నేతలు కుట్రలకు తెరలు లేపుతారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నప్పుడు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలో భాగమే ఉండవల్లి మాటలు అని హరీష్రావు పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో పంటలు పండాలంటే గిరిజనులను కాల్చి చంపేయాలని ఉండవల్లి మాట్లాడారని హరీష్రావు గుర్తు చేశారు. ఉండవల్లి మాటల్లో హేతుబద్దత లేదని, ఆంధ్రా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకు ఉండవల్లి నీచంగా మాట్లాడుతున్నారని హరీష్రావు మండిపడ్డారు.కేసీఆర్ ఎల్లప్పుడూ అబద్ధాలు మాట్లాడితే మరీ 2004లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. నయవంచనలో ఉండవల్లి అరుణ్కుమార్కు ఎవరూ సాటి రారు అని హరీష్రావు పేర్కొన్నారు.