కాంగ్రెస్ నేత దారుణ హత్య..
posted on May 18, 2016 11:22AM
కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గరయ్యారు. కృష్ణాజిల్లా తిరువూరు మండలం.. అక్కపాలెం సర్పంచి దోమతోటి వెంకటరమణ భర్త నాగేశ్వరరావును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున నాగేశ్వరరావు తాగునీటికి విడుదల చేసేందుకు రక్షిత నీటి పథకం ఓవర్హెడ్ ట్యాంకు దగ్గరకి వెళ్లారు. అక్కడ కొందమంది వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపి ఓ మురుగు నీటి గుంతలో పడేశారు. అనంతరం అక్కడి స్థానికులు నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు కావాలనే పథకం ప్రకారం చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.