టీడీపీ నేతలు మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి


చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టీడీపీ నేతలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు నగర శివారు యాదమరి మండలం ముత్తిరేవుల క్రాస్ వద్ద చెన్నై-బెంగళూరు హైవేపై లారీ-బోలేరు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కుప్పంలోని శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, పార్టీ నేతలు బాలకృష్ణ, సురేశ్ లు మృతి చెందగా.. సర్పంచ్ గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈప్రమాదం గురించి తెలుసుకున్న చంద్రబాబు, లోకేశ్ లు షాక్ కు గురయ్యారు. వెంటనే పార్టీ చిత్తూరు జిల్లా నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న వారిద్దరూ చనిపోయిన పార్టీ నేతల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News