వాయిదాలతో శాసనసభ వాయిదా

 

 

 AP Assembly proceedings disrupted, AP Assembly budget session, budget session AP Assembly

 

 

శాసనసభ రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరుగకుండా వాయిదా పడింది. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు పట్టుపడుతూ పోడియం దగ్గర డిమాండ్‌ చేయగా..తెలంగాణాపై తీర్మానం చేయాలంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు సభను స్తంభింపచేశారు. దీంతో స్పీకర్ సభను పదేపదే రెండు సార్లు అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు తమ అందోళన కొనసాగించారు. బడ్జెట్ పద్దులపై చర్చ చేద్దామంటూ స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన విపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. మొదటి వాయిదా తర్వాత సమావేశమైన సభలో బడ్జెట్‌ పద్దులపై స్టాండింగ్‌ కమిటీలు రూపొందించిన నివేదికలను సభకు సమర్పించినట్టు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించారు. సభ్యుల ఆందోళనల మధ్యే పలు బిల్లులను మంత్రులు ప్రవేశట్టారు. రెండుసార్లు వాయిదా తర్వాత మూడోసారి ప్రారంభమైన సభలోను విపక్షాల ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.